బెంగళూరు రిసార్టులో ఘర్షణ.. ఎమ్యెల్యే తలపై బాటిల్ తో కొట్టిన మరో ఎమ్మెల్యే

- కర్ణాటకలో ఆపరేషన్ లోటస్
- ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన కాంగ్రెస్
- ఆనంద్ సింగ్ తలపై బాటిల్ తో కొట్టిన జేఎన్ గణేష్
మరోవైపు, ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగిందనే వార్తల్లో నిజం లేదని మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఇంకోవైపు కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో ఇంతకన్నా రుజువు మరేం కావాలని వారు ప్రశ్నించారు. ఈగిల్టన్ ఘర్షణలో ఒక ఎమ్మెల్యే ఆసుపత్రిపాలయ్యారని... అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై కాంగ్రెస్ ఎంత కాలం ఆరోపణలు చేస్తుందని అన్నారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా, కలసిమెలసి ఉన్నారని చెప్పారు. ఈగిల్టన్ రిసార్టుకు 76 మంది ఎమ్మెల్యేలను శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీ తరలించింది.