Bollywood: రోబో 2.ఓ సినిమాకు అరుదైన గౌరవం.. గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్!

  • వివరాలను వెల్లడించిన రసూల్ పోకుట్టి
  • బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో నామినేట్
  • సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శంకర్

సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో  శంకర్ రోబో 2.ఓ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా రోబో 2.ఓ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. రోబో 2.ఓ గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయినట్లు ఈ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన రసూల్ పోకుట్టి తెలిపారు.

‘బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌’ విభాగంలో రోబోకు ఈ గుర్తింపు దక్కిందన్నారు. ప్రఖ్యాత మోషన్ పిక్చర్‌ సౌండ్‌ ఎడిటర్స్‌(ఎంపీఎస్‌ఈ) ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా ఫిబ్రవరి 17న ఈ వేడుకలు జరుగుతాయి. 2.ఓ తో పాటు మరెన్నో అంతర్జాతీయ చిత్రాలు వేర్వేరు విభాగాల్లో అవార్డులకు నామినేట్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సౌండ్‌ ఎడిటింగ్‌ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. 3డీ ఫార్మెట్‌లో 4డీ ఎస్‌ఎల్‌ఆర్‌ సౌండ్‌సిస్టంలో రోబో 2.ఓ సినిమాను శంకర్ తెరకెక్కించారు.

More Telugu News