akhil: అఖిల్ లోని ఒక గొప్ప గుణం చెబుతా: జూనియర్ ఎన్టీఆర్

  • ‘మిస్టర్ మజ్ను’ ప్రీ-రిలీజ్ వేడుక
  • ట్రైలర్ ని లాంచ్ చేసిన తారక్
  • అఖిల్ గొప్పగా ఆత్మవిమర్శ చేసుకుంటాడు

మిస్టర్ మజ్ను’ ట్రైలర్ ను ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొద్ది సేపటి క్రితం లాంచ్ చేశారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ ప్రీ-రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో నాగార్జున, నాగచైతన్య, ఈ సినిమా హీరో అఖిల్, చిత్ర యూనిట్ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రం తొలి టికెట్ ని జూనియర్ ఎన్టీఆర్ కి నాగార్జున అందజేశారు.

అనంతరం, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, అఖిల్ గురించి ఒక గొప్ప గుణం చెబుతాను, ఒక నటుడికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిమర్శ, అఖిల్ చేసుకున్నంత గొప్పగా ఆత్మవిమర్శ మరెవరూ చేసుకోరేమోనని అన్నారు. ఎన్నోసార్లు ఆత్మ విమర్శ చేసుకుంటూ, తన పంథాను మార్చుకుంటూ ఈరోజు ఈ మజిలీకి చేరిన నటుడు అఖిల్ అని అన్నాడు. ‘ఈరోజు నేను చెబుతున్నాను రాసిపెట్టుకోండి అఖిల్ విల్ బీ వన్ ఆఫ్ ది  ఫైనెస్ట్ యాక్టర్స్ వన్ డే. ఆరోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. ఆరోజు ఎంతో దూరంలో లేదు. మిస్టర్ మజ్ను’ చిత్రం ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. ఈ చిత్రం అఖిల్ కెరీర్ లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నా’ అని అన్నాడు.

More Telugu News