kolkata: ఈ కూటమి ద్వారా దేశానికి కొత్త పాలన అందిస్తాం: శరద్ పవార్

  • దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది
  • మహోన్నత రాజ్యాంగంపైనా దాడి జరుగుతోంది
  • రైతన్న ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడింది

ఐదేళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. కోల్ కతాలో బీజేపీ యేతర పక్షాల ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ దేశ మహోన్నత రాజ్యాంగంపైనా దాడి జరుగుతోందని, రాజ్యాంగ వ్యవస్థలపై మోదీ ప్రభుత్వ దాడిని యావత్తు దేశం చూస్తోందని అన్నారు. కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందని, ఏ పదవులను ఆశించీ తాము ఇక్కడకు రాలేదని, దేశంలో మార్పు సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోందని అన్నారు. ఈ కూటమి ద్వారా దేశానికి కొత్త పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. 

More Telugu News