Mahesh Babu: రైతుగా ట్రాక్టర్ నడుపుతూ మహేశ్ బాబు .. పొల్లాచ్చిలో భారీ ఫైట్

  • మహేశ్ 25వ మూవీగా 'మహర్షి'
  • పొల్లాచ్చిలో భారీ ఫైట్ సీన్ 
  • నాయికగా పూజా హెగ్డే    

మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు మహా శ్రీమంతుడిగానే కాదు .. ఓ సాధారణ రైతుగాను కనిపించనున్నాడు. విలేజ్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది.

మహేశ్ బాబు రైతు లుక్ తో ట్రాక్టర్ తో పొలం దున్నుతూ వుండే సన్నివేశంతో పాటు, 60 ట్రాక్టర్లతో .. 30 నాగళ్లతో అక్కడ ఒక భారీ ఫైట్ సీన్ ను ప్లాన్ చేశారట. అక్కడ చిత్రీకరించే ఈ సన్నివేశాలు సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. తన స్నేహితుడి కోసం ఇండియా వచ్చిన హీరో .. వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కథలో ప్రధానాంశంగా కనిపిస్తుందని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, పూజా హెగ్డే కథానాయికగా కనువిందు చేయనుంది.

More Telugu News