sundeep kishan: తన నీడతోనే యుద్ధం చేసే కథగా .. 'నిను వీడని నీడను నేనే'

  • సందీప్ కిషన్ హీరోగా హారర్ మూవీ
  • కొనసాగుతోన్న చివరి షెడ్యూల్ షూటింగ్ 
  • ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచన   

తెలుగులో సందీప్ కిషన్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే కొంత కాలంగా ఆయన సక్సెస్ అనేది చూడలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో 'నిను వీడని నీడను నేనే' సినిమా చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యన్ .. దయా నిర్మాణంలో, కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తోన్న ఎమోషనల్ హారర్ మూవీ ఇది.

తాజాగా ఈ సినిమాను గురించి కార్తీక్ రాజు మాట్లాడుతూ .. "ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాను. మనిషి తన నీడతోనే యుద్ధం చేయవలసి వస్తే ఎలా వుంటుందనే పాయింట్ తో ఈ సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం హీరో హీరోయిన్లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాము .. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో వున్నాము" అని చెప్పాడు. 

More Telugu News