nani: తండ్రీ కొడుకులుగా కనిపించనున్న నాని

  • 'జెర్సీ' సినిమా పనుల్లో నాని
  • రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ
  • కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్     

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. నాని క్రికెటర్ గా .. రంజీ క్రికెట్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతోంది. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. తండ్రీ కొడుకులుగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు.

తన తండ్రి గురించి కొడుకైన నాని చెబుతూ ఆ కథలోకి ప్రేక్షకులను తీసుకెళతాడట. అలా ఆయన ఈ సినిమాలో తండ్రిగానూ .. కొడుకుగాను తెరపై కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా కోసం క్రికెట్ లో నాని ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. రంజీ క్రికెట్ రాజకీయాలను కూడా ఈ సినిమాలో టచ్ చేయనున్నట్టు సమాచారం. 

More Telugu News