Andhra Pradesh: నిర్లక్ష్యం ఎఫెక్ట్.. ఉయ్యూరులో శాంతి థియేటర్ ను సీజ్ చేసిన అధికారులు!

  • నిబంధనలు పాటించని థియేటర్
  • అర్ధరాత్రి షో ఆపేసిన జాయింట్ కలెక్టర్
  • థియేటర్ ను సీజ్ చేసిన ఎమ్మార్వో

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్న శాంతి థియేటర్ ను జిల్లా రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. థియేటర్ యాజమాన్యం నిబంధనలను పాటించకపోవడంతో అధికారులు ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిన్న అర్ధరాత్రి 12 గంటలకు థియేటర్ వద్దకు సిబ్బందితో కలిసి చేరుకున్న జాయింట్ కలెక్టర్.. షోను నిలిపివేయించారు. ఈ సందర్భంగా ఉయ్యూరు ఎమ్మార్వో రాజకుమారి  శాంతి థియేటర్ ను సీజ్ చేశారు.

More Telugu News