Telangana congress: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్క నియామకం

  • సీఎల్పీ నేత ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెర
  • మల్లు భట్టి విక్రమార్కను నియమించిన అధిష్ఠానం
  • ఈ మేరకు ఓ ప్రకటన విడుదల

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత ఎంపికపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు.

 కాగా, నిన్న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను రాహుల్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, సీఎల్పీ రేసులో సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నప్పటికీ ఈ పదవి దళిత వర్గానికి చెందిన భట్టికే దక్కింది. 2009లో, 2014లో భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మధిర నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. 

More Telugu News