East Godavari District: కన్నా ఓ పార్టీకి కోవర్టుగా పని చేస్తున్నారు: బీజేపీ నేత ఉంగరాల చినబాబు ఆరోపణ

  • ఒకరిపై మరొకరు ఆగ్రహం
  • కన్నా తీరుపై ధ్వజం
  • హామీలు అమలు చేయనందునే పార్టీని వీడుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత ఉంగరాల చినబాబు.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరుపై ధ్వజమెత్తారు. బీజేపీ విభజన హామీలు అమలు చేయని కారణంగానే ఎమ్మెల్యేలు బీజేపీని వీడుతున్నారని చినబాబు మండిపడ్డారు. కన్నా.. ఓ పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

More Telugu News