vanteru: వంటేరు ప్రతాప్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్

  • కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వంటేరు 
  • వంటేరుకు అభినందనలు తెలిపి పార్టీలోకి ఆహ్వానం
  • తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ నేత, గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వంటేరు ప్రతాప్ రెడ్డి ఆ పార్టీని వీడి, టీఆర్ ఎస్ లో చేరుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవ న్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వంటేరుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి రావాలని కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంటేరు అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వంటేరు అనుచరులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 

More Telugu News