charan: 50 కోట్ల షేర్ ను రాబట్టిన 'వినయ విధేయ రామ'

  • సంక్రాంతి కానుకగా వచ్చిన 'వినయ విధేయ రామ'
  • తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో 50 కోట్ల షేర్
  •  ఒక్క నైజామ్ లోనే 12 కోట్లకి పైగా వసూళ్లు  

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా రూపొందిన 'వినయ విధేయ రామ' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండుగ సెలవులు కావడంతో ఈ సినిమా కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. దర్శకుడిగా బోయపాటికి గల ఇమేజ్ .. చరణ్ కి గల క్రేజ్ కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో ఈ సినిమా 50 కోట్ల షేర్ ను సాధించింది.

ఒక్క నైజాంలోనే ఈ సినిమా తొలివారంలో 12 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమీ లేకపోవడం వలన, వసూళ్లు పడిపోయే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతూనే వచ్చారు. దాంతో ఓ మాదిరి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అంతా ఆశించారు. కానీ యాక్షన్ పాళ్లు ఎక్కువైపోవడం ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది.

More Telugu News