kamal: ఈ రోజునే సెట్స్ పైకి 'భారతీయుడు 2'

  • కమల్ సరసన కాజల్
  • కీలక పాత్రల్లో దుల్కర్ .. శింబు
  • 2020 సంక్రాంతికి రిలీజ్  

శంకర్ .. కమలహాసన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా వచ్చి ఇంతకాలమైనా, ప్రేక్షకులు దానిని మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి శంకర్ సీక్వెల్ ప్లాన్ చేశాడు. '2.ఓ' తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే 'భారతీయుడు 2' సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తి చేసేశాడు. తొలి షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేశారు.

చెన్నైలో ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెడుతున్నారు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ .. తమిళ హీరో శింబు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే పక్కా ప్లానింగ్ తో శంకర్ వున్నాడు. 'భారతీయుడు 2' తరువాత ఇక తాను సినిమాలు చేయనని కమల్ చెప్పిన సంగతి తెలిసిందే. 

More Telugu News