Telangana: హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు .. ఒకరి దుర్మరణం!

  • పేలుడు తీవ్రతకు కూలిపోయిన ఇల్లు
  • హైదరాబాద్ లోని కాప్రా చౌరస్తాలో ఘటన
  • కేసు నమోదుచేసిన పోలీసులు

ఓ ఇంట్లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లోని కాప్రా చౌరస్తాలో చోటుచేసుకుంది.

కాప్రా చౌరస్తాలోని ఓ ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు సిలిండర్లను రీఫిల్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటానాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News