Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు

  • ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు సమావేశాలు
  • 30న ఉదయం 9.30 గంటలకు ఉభయసభల భేటీ
  • గవర్నర్ నరసింహన్ పేరిట నోటిఫికేషన్ జారీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయా కార్యదర్శులు వెల్లడించారు. జనవరి 30న ఉదయం 9.30 గంటలకు ఉభయసభలు సమావేశమవుతాయని, గవర్నర్ నరసింహన్ పేరిట నోటిఫికేషన్ జారీ అయింది. కాగా, ఫిబ్రవరి 2న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది.

More Telugu News