Andhra Pradesh: సవాల్ గా తీసుకుని ముందుకు వెళతాం: గోపాలకృష్ణ ద్వివేది

  • ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది నియామకం
  • స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూస్తా
  • అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామన్న కమిషనర్ 

ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, ప్రజలు, అందరితో కలిసి స్వేచ్ఛగా ఈ ఎన్నికలు జరిగేలా చూస్తామని అన్నారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని, అయినప్పటికీ సవాల్ గా తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఓట్ల గల్లంతు అంశాన్ని ప్రస్తావిస్తూ, ఓటర్లు అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్ కమిషన్ కూడా ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. 

More Telugu News