akhil: 'మిస్టర్ మజ్ను' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

  • మరో ప్రేమకథా చిత్రంగా 'మిస్టర్ మజ్ను'
  • ఈ నెల 19న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 25వ తేదీన సినిమా విడుదల       

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 'మిస్టర్ మజ్ను' నిర్మితమైంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈలోగా అంటే .. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం జరిగే ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా అఖిల్ కనిపించనున్నాడు. ఈ సినిమా హిట్ కావలసిన అవసరం అఖిల్ కి చాలావుంది. ఇక 'సవ్యసాచి'తో నిరాశ చెందిన నిధి అగర్వాల్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే. మరి ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. 

More Telugu News