Davos: దావోస్ పర్యటనను రద్దు చేసుకున్న చంద్రబాబు!

  • లోకేశ్ నేతృత్వంలో దావోస్ కు వెళ్లనున్న బృందం
  • ఈ బృందంలో లోకేశ్, యనమల సహా 17 మంది  
  • ఈ నెల 22 నుంచి 25 వరకు పర్యటించనున్న బృందం

ఏపీ సీఎం చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నందున్న చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఏపీ అధికారుల బృందం దావోస్ కు వెళ్లనుంది. దావోస్ లో చంద్రబాబు పాల్గొనే సమావేశాలకు లోకేశ్ హాజరుకానున్నారు. మంత్రులు లోకేశ్, యనమల సహా 17 మంది సభ్యులు  ఈ బృందంలో ఉన్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు దావోస్ లో పర్యటించనున్నారు.

More Telugu News