Andhra Pradesh: కోడి పందేల ఎఫెక్ట్.. కృష్ణాజిల్లాలో గుండెపోటుతో వ్యక్తి మృతి!

  • కృష్ణా జిల్లాలోని కొడవటికల్లులో ఘటన
  • రూ.5 వేలు పందెం కట్టిన రవి
  • ఒత్తిడికి లోనయి గుండెపోటుతో దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. కోడి పందేలపై బెట్టింగ్ పెట్టిన ఓ వ్యక్తి ఒక్కసారిగా ఒత్తిడికి లోనై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడి కొడవటికల్లు ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో నందిగామ ప్రాంతానికి చెందిన భట్టిప్రోలు రవి ఇక్కడకు వచ్చాడు. ఓ కోడి పుంజుపై రూ.5,000  పందెం కట్టాడు. పోటీ జోరుగా సాగుతుండగా రవి గుండెలు పట్టుకుని కుప్పకూలిపోయాడు. ఆయన్ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

More Telugu News