Cricket: సెంచరీతో కదం తొక్కిన షాన్ మార్ష్.. భారత్ విజయ లక్ష్యం 299 పరుగులు!

  • అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో రెండో వన్డే
  • షాన్ మార్ష్ కు మాక్స్ వెల్ అండ
  • భువనేశ్వర్ కు నాలుగు వికెట్లు

అడిలైడ్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ పై భారీ స్కోర్ నమోదుచేసింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేనాటికి 9 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో షాన్ మార్ష్ సెంచరీ(131 పరుగులు.. 11 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అదరగొట్టగా, మాక్స్ వెల్(48) స్టోనియస్ (29) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, షమీ మూడు, జడేజా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తేనే మూడు మ్యాచ్ ల సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంటాయి. సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News