Narendra Modi: వచ్చే ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఎంత?.. సర్వే ప్రారంభించిన మోదీ ప్రభుత్వం

  • ‘నమో’ యాప్ ద్వారా సర్వే
  • అందరూ పాల్గొనాలని ప్రధాని పిలుపు
  • ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వీడియో

’’మోదీ ప్రభుత్వ పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాల మహాకూటమి ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరిచ్చే సమాధానాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సర్వేలో మీరు పాల్గొనండి. ఇతరులకూ చెప్పండి’’ అంటూ నరేంద్రమోదీ ప్రభుత్వం సరికొత్త సర్వేను ప్రారంభించింది.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ‘నమో’ యాప్ ద్వారా ఈ సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో బోలెడన్ని ప్రశ్నలు సంధించారు. సర్వేలో పాల్గొనాలంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వీడియోల ద్వారా దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని యోచిస్తున్నారు. బీజేపీకి ప్రతికూలంగా ఉన్న చోట సిట్టింగ్‌ ఎంపీలను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

More Telugu News