Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ఇదే చివరి సంక్రాంతి: హాస్యనటుడు పృథ్వీరాజ్

  • చంద్రబాబు మోసాలను తెలియజెబుతాం
  • వీధి నాటకాలతో ప్రజలను చైతన్య పరుస్తాం
  • మహిళలను అగౌరవపరచడం బాబు నైజం

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుకి ఇదే చివరి సంక్రాంతి అని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజలకు తెలియజెబుతామని అన్నారు. ఈ నేపథ్యంలో వీధి నాటకాలు ప్రదర్శిస్తామని, ప్రజలను చైతన్య పరుస్తామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు షర్మిళపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి ప్రస్తావించారు. మహిళలను అగౌరవపరచడం చంద్రబాబు నైజమని విమర్శించారు. 

More Telugu News