sharmila: షర్మిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

  • దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు
  • అదనపు డీసీపీ నేతృత్యంలో దర్యాప్తు ప్రారంభం
  • ఈ దుష్ప్రచారాన్ని ఖండించిన వైసీపీ నేతలు

హీరో ప్రభాస్ కు, తనకు సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై హైదరాబాద్ పోలీసులకు వైసీపీ నాయకురాలు షర్మిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ నేతృత్యంలో ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. కాగా, వైఎస్ షర్మిళపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు ఖండించారు. ఇది కేవలం షర్మిళపై జరిగిన విషప్రచారం మాత్రమే కాదని, మొత్తం మహిళలపై జరిగిన దాడి అని అభివర్ణించారు.

More Telugu News