ajith: దుమ్మురేపేస్తోన్న 'విశ్వాసం' .. 4 రోజుల్లో 75 కోట్లు

  • తమిళనాట 500 థియేటర్స్ లో విడుదల 
  • 4 రోజుల్లో అక్కడి వసూళ్లు 51.2 కోట్లు
  • కర్ణాటక వసూళ్లు 5.3 కోట్లు  

శివ .. అజిత్ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు వరుస విజయాలను అందుకోవడంతో, సహజంగానే 'విశ్వాసం' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీ 'పేట'తో పాటు ఈ సినిమా రంగంలోకి దిగడంతో పోటీ వాతావరణం నెలకొంది.

విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా 75.25 కోట్లను వసూలు చేసింది. తమిళనాడులో 500 థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయగా, తొలిరోజునే 15 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో 4 రోజుల్లోనే 51.2 కోట్లు రాబట్టేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 75.25 కోట్లను వసూలు చేసింది. కర్ణాటకలో ఈ సినిమా 4 రోజుల్లో 5.3 కోట్లను వసూలు చేయడం విశేషం. అటు మాస్ ఆడియన్స్ ను .. ఇటు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండటం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

More Telugu News