charan: 'వినయ విధేయ రామ' నుంచి ఆ సీన్స్ లేపేస్తారా?

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన చరణ్ మూవీ
  • యాక్షన్ సీన్స్ పై ఆడియన్స్ అసహనం 
  • మెగా అభిమానుల్లో నిరాశ

చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో .. భారీ అంచనాలతో ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి సినిమా అనగానే అంతా యాక్షన్ మూవీనే అని అనుకున్నారు. కానీ ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ప్రచారం మొదలు కావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆసక్తిని చూపడం మొదలుపెట్టారు.

అయితే ఎమోషన్స్ సంగతి అలా ఉంచితే యాక్షన్ సీన్స్ అతిగా వున్నాయనే టాక్ వచ్చింది. ట్రైన్ సీన్ .. విలన్ ను కరిచి పామే చచ్చిపోవడం వంటి సీన్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ తరహా యాక్షన్ సీన్స్ వలన డామేజ్ ఎక్కువగా ఉందని గ్రహించిన టీమ్, ఆ సీన్స్ ను లేపేసే ఆలోచన చేస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆ సీన్స్ ను తొలగించడం వలన కొంతవరకూ ఫలితం ఉండొచ్చునని భావిస్తున్నారట. తమ హీరో పడిన కష్టానికి తగిన ఫలితం లభించకపోవడం పట్ల అభిమానులు నిరాశకి లోనయ్యట్టుగా తెలుస్తోంది. 

More Telugu News