NTR: ‘కథానాయకుడు’ని వీక్షించిన నారా, నందమూరి కుటుంబాలు

  • నారా వారి పల్లెలో నారా, నందమూరి కుటుంబాలు
  • తిరుపతిలో ఈ చిత్రాన్ని చూసిన లోకేశ్, బ్రాహ్మణి
  • చరిత్రలో ఈ చిత్రం మిగిలిపోతుందన్న లోకేశ్వరి

తిరుపతిలోని పీజీఆర్ థియేటర్ లో ‘యన్.టి.ఆర్’ తొలి భాగం ‘కథానాయకుడు’ని నారా, నందమూరి కుటుంబాలు ఈరోజు వీక్షించాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ రెండు కుటుంబాలు నారా వారి పల్లెకు విచ్చేశాయి. ఈ సందర్భంగా ‘కథానాయకుడు’ని చూసేందుకు మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, గారపాటి లోకేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు థియేటర్ కు వెళ్లారు. ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం వారిని సాదరంగా ఆహ్వానించింది.

ఈ చిత్రం మరింత విజయం సాధించాలి: గారపాటి లోకేశ్వరి

సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి తాము నారావారి పల్లెకు వచ్చామని ఎన్టీఆర్ కూతురు గారపాటి లోకేశ్వరి అన్నారు. ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ సినిమా చాలా సక్సెస్ అయిందని, అందుకే, వారి సమక్షంలో ఈ చిత్రం చూడాలని తమ కుటుంబసభ్యులందరం కలిసి వచ్చామని చెప్పారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నానని, చరిత్రలో ఈ చిత్రం మిగిలిపోతుందని లోకేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News