sankranthi: సంక్రాంతి సంబరాలు.. పెదరావూరు గ్రామానికి చేరుకున్న పవన్ కల్యాణ్

  • తెనాలిలోని పెదరావూరులో వేడుకలు 
  • నంది వెలుగు- పెదరావూరు వరకు భారీ ర్యాలీ
  • భోగి సంబరాల్లో పాల్గొననున్న పవన్ 

తెనాలిలోని పెదరావూరులో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా నందివెలుగు నుంచి పెదరావూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సంక్రాంతి పండగ సందర్భంగా పెదరావూరులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతులు, మహిళలు, యువతతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ‘జాగోరే జాగో’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం, భోగి సంబరాల్లో పవన్ పాల్గొంటారని సమాచారం. 

More Telugu News