secunderabad: సికింద్రాబాద్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం

  • ఫెస్టివల్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి  
  • ఈ వేడుకలు నిర్వహిస్తుండటం చాలా సంతోషం
  • సీఎం కేసీఆర్ ప్రోత్సహించడం అభినందనీయం

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. దీంతో పాటు, స్వీట్ ఫెస్టివల్ కూడా ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని సీఎం కేసీఆర్ ప్రోత్సాహం అందించడం అభినందనీయమని ప్రశంసించారు. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించడం చాలా సంతోషమని అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పతంగిని ఎగురవేశారు. కాగా, నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఈ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు నిరంతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

More Telugu News