Ram charan: విహారయాత్ర ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, అఖిల్ .. ఉపాసన ఆసక్తికర ట్వీట్!

  • విహారయాత్రలో మంచుపర్వతాల సందర్శన
  • స్కీయింగ్ కు సిద్ధంగా ఉన్న చరణ్, అఖిల్ ఫొటో పోస్ట్
  • అబ్బాయిలు ఎప్పటికీ అబ్బాయిలేనన్న ఉపాసన

యువ హీరోలు రామ్ చరణ్, అఖిల్ లు ప్రస్తుతం విహార యాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు. తమ యాత్రంలో భాగంగా మంచుపర్వతాలను కూడా వీరు సందర్శించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అఖిల్ తో మరో ఇద్దరు  స్కీయింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఓ ఫొటోను చెర్రీ భార్య ఉపాసన ఓ పోస్ట్ చేశారు. అబ్బాయిలు ఎప్పటికీ అబ్బాయిలేనని, అక్కడ ఎలాంటి యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేయరని అనుకుంటున్నానని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, ఆ ట్రిప్ కు ఉపాసన వెళ్లలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు.

More Telugu News