Maharshi: మహేశ్ సరసన కత్రినా?

  • సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ 
  • ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న చిత్రం
  • కత్రినాతో సుకుమార్ సంప్రదింపులు

ఓ వైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేసుకుంటూనే, మరోవైపు సుకుమార్‌తో సినిమా చేసేందుకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం ముందస్తు నిర్మాణ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ కత్రినాను తీసుకోవాలని దర్శక, నిర్మాలు భావిస్తున్నట్టు సమాచారం. గతంలో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల ద్వారా కత్రినా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే కత్రినాతో సుక్కు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. మరి ఆమె ఈ చిత్రానికి ఓకే చెప్పిందో.. లేదో తెలియాల్సి ఉంది.

More Telugu News