ఎయిర్ టెల్: ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

  • ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేషన్‌ రుసుము నిలిపివేత
  • ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించిన ఎయిర్ టెల్
  • రోమింగ్ ప్యాక్ లని పెంచుకునే ఉద్దేశ్యం

ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఇప్పటి వరకు ఎయిర్ టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేషన్‌ కి ప్రతినెలా రూ.99 వసూలు చేస్తోంది. ఇకపై ఈ రుసుము ఉండదని ఈ మేరకు తమ వినియోగదారులకి ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించినట్లు ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ విఠల్ తెలిపారు. ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లని పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News