Harish Rao: 40 మంది ఎమ్మెల్యేలతో కలసి హరీష్ రావు కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు!

  • ఫేస్ బుక్ ద్వారా ప్రచారం చేస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి
  • జనగామ డీసీపీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్వీ నేతలు
  • చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ విన్నపం

టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మరో 40 మంది ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ జనగామ టీఆర్ఎస్వీ నేతలు డీసీపీకి ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ మణి అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ ద్వారా ఈ ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. 

More Telugu News