Chandrababu: చంద్రబాబు సంక్రాంతి కానుక.. పింఛన్‌ను రూ.2 వేలకు పెంచుతూ నిర్ణయం

  • బోగోలు జన్మభూమిలో ప్రకటన
  • లబ్ధి పొందనున్న 54 లక్షల మంది
  • జనవరి నుంచి అందనున్న పింఛన్

ఏపీ ప్రభుత్వం పింఛనుదారులకు సంక్రాంతి కానుకను ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు అందజేసే పింఛన్లను రూ.2000లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో ప్రకటన చేశారు. ఈ పెంపుదల ద్వారా 54 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. జనవరి నుంచి ఈ పింఛన్ లబ్ధిదారులకు అందనుంది.  

More Telugu News