rajani: చెన్నైలో రజనీ .. అజిత్ ల తొలిరోజు వసూళ్లు

  • రజనీ నుంచి వచ్చిన 'పేట'
  • 'విశ్వాసం'తో పలకరించిన అజిత్
  • వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించే ఛాన్స్         

రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన 'పేట' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అజిత్ హీరోగా శివ దర్శకత్వం వహించిన 'విశ్వాసం' కూడా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాట ఈ రెండు సినిమాలు చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. ఇక చెన్నై సిటీలో ఈ రెండు సినిమాలు వసూళ్ల పరంగా పోటీ పడ్డాయి. రజనీకాంత్ 'పేట' తొలిరోజున చెన్నైలో 1.12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక అజిత్ 'విశ్వాసం' తొలిరోజున చెన్నై సిటీలో 88 లక్షల గ్రాస్ ను రాబట్టింది. పూర్తి మాస్ అంశాలతో 'పేట' ప్రేక్షకుల ముందుకు రాగా, మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుని 'విశ్వాసం' వచ్చింది. ఈ వీకెండ్ లో ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లను సొంతం చేసుకునే అవకాశాలు వున్నాయనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. తెలుగులో నిన్ననే 'పేట' విడుదల కాగా, 'విశ్వాసం' త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

More Telugu News