Andhra Pradesh: దేశంలోనే తొలిసారి.. ఏపీలో వాహనాలకు ఇక ఒకటే సిరీస్!

  • ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకటే సిరీస్
  • ఏపీ 39తో మొదలు
  • ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్

ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా వాహనాలకు ఒకే సిరీస్‌ నంబరును అమలు చేయాలని నిర్ణయించింది. ‘ఒక రాష్ట్రం-ఒక నంబరు’ విధానంలో భాగంగా ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఒకే సిరీస్ నంబరును కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంటే, ఇకపై రాష్ట్రంలోని కొత్త వాహనాలన్నీ ‘ఏపీ 39’ సిరీస్‌తోనే ప్రారంభం అవుతాయి. జిల్లాకో సిరీస్ ఉండదన్నమాట. ఫలితంగా వాహనాలను ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ విధానం వల్ల వాహనదారులకు సమయం, సొమ్ము ఆదా అవడమే కాకుండా రవాణాశాఖకు ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

More Telugu News