Ajith kumar: అజిత్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేస్తుండగా ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

  • నేడు విడుదలైన ‘విశ్వాసం’
  • భారీ కటౌట్ ఏర్పాటు
  • ఎక్కువ మంది ఎక్కడంతో ప్రమాదం

తమిళనాడులోని తిరుకొవిళూరులో ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేస్తుండగా కటౌట్ ఒక్కసారిగా కుప్పకూలింది. నేడు అజిత్, నయనతార జంటగా నటించిన ‘విశ్వాసం’ సినిమా విడుదల అయింది.

ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు తిరుకొవిళూరులో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. సినిమా విడుదలైన సందర్భంగా ఆ కటౌట్‌ పైకి ఎక్కువ మంది అభిమానులు ఎక్కి పాలాభిషేకం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

More Telugu News