Redmi Note 7: రెడ్ మీ నోట్7 స్మార్ట్ ఫోన్.. 48 మెగాపిక్సల్ కెమెరాతో వచ్చేసింది

  • చైనాలో విడుదల
  • మూడు వేరియంట్ లలో విడుదల 
  • ఆకట్టుకుంటున్న ఫీచర్లు

షియోమీ మొబైల్ దిగ్గజం తాజాగా 'రెడ్ మీ నోట్7' ని చైనాలో విడుదల చేసింది. 48/5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో పాటు దీనిలో భారీ బ్యాటరీ (4000ఎంఏహెచ్)ని అందిస్తున్నారు. 3 జీబీ/4 జీబీ ర్యామ్ తో పాటు 6 జీబీ వేరియంట్ కూడా మార్కెట్లో లభించనుంది. ట్విలైట్ గోల్డ్, ఫాంటాసి బ్లూ, బ్రైట్ బ్లాక్ రంగులలో ఈ ఫోన్ లభించనుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర సుమారు రూ.10,300, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర సుమారు రూ.12,400గా ఉంది. అలాగే, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధ‌రను సుమారు రూ.14,500గా నిర్ణ‌యించారు.

ప్రత్యేకతలు:

  • 48/5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • 6.3" ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే ( 2340 ×1080 పిక్స‌ల్స్)
  • ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌
  • 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టం
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌
  • 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0

More Telugu News