NTR: ‘కథానాయకుడు’ ఎంతటి చరిత్ర సృష్టిస్తుందో చెప్పలేను: పరుచూరి గోపాలకృష్ణ

  • ఎన్టీఆర్ రూపంలో బాలయ్య మరో చరిత్ర సృష్టించారు
  • ఆ మహానుభావుడి ఆర్ద్రతతోనే నా కళ్లు చెమ్మగిల్లాయి
  • ఎన్టీఆర్ ని చూడని వాళ్లకు ఆయన్ని చూపించిన ఘనత బాలయ్యదే

‘యన్.టి.ఆర్’ చిత్రం తొలి భాగం ‘కథానాయకుడు’ ఎంతటి చరిత్ర సృష్టిస్తుందో తాను చెప్పలేనని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఈరోజు విడుదలైన ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలిసి ఆయన వీక్షించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ సృష్టించిన చరిత్రను ఎన్టీఆర్ రూపంలో బాలయ్య మరో చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ఈ

 చిత్రం ద్వారా ఇవాళ ఆ మహాపురుషుడి చరిత్రను అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. ఆ మహానుభావుడిని చూస్తుంటే ఆర్ద్రతతో తన కళ్లు చెమ్మగిల్లాయని, ఈ చిత్రం ద్వారా బాలయ్య గొప్ప చరిత్రను సృష్టించాడని ప్రశంసించారు. ఈ చిత్రంలో తనకు బాలయ్య కనిపించలేదని, ఎన్టీఆర్ ని చూస్తున్నట్టే ఉందని అన్నారు. ఎన్టీఆర్ ని ఎరుగని వాళ్లకు ఎన్టీఆర్ ని చూపించిన ఘనత బాలయ్యకే దక్కుతుందని, బసవతారకం పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. 

More Telugu News