charan: ఏపీలో 'వినయ విధేయ రామ' స్పెషల్ షోలకి అనుమతి

  • ఈ నెల 11వ తేదీన భారీ రిలీజ్ 
  • చరణ్ యాక్షన్ .. కైరా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ
  • హిట్ ఖాయమంటోన్న చరణ్ ఫ్యాన్స్  

చరణ్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో 'వినయ విధేయ రామ' సినిమా నిర్మితమైంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని అలరించనుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మరో 3 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఈ సినిమా స్పెషల్ షోలకి గాను ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతిని పొందింది.

ఈ పండుగ రోజులలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ అదనంగా మరో రెండు షోలు వేస్తారు. ఇలా అదనపు షోలకి అనుమతి లభించడం వలన, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం వుంది. బోయపాటి మార్క్ మాస్ అంశాలు .. చరణ్ యాక్షన్ .. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా తప్పకుండా చరణ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

More Telugu News