Kerala: శబరిమల ఎఫెక్ట్.. కేరళలో మసీదులోకి దూసుకెళ్లేందుకు మహిళల యత్నం.. అరెస్ట్!

  • హిందూ మక్కల్ కట్చి కార్యకర్తల దూకుడు 
  • కేసు నమోదుచేసిన కేరళ పోలీసులు
  • తామెందుకు వెళ్లకూడదని ప్రశ్నించిన మహిళలు

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శబరిమల దగ్గరే ఉన్న వావర్ మసీదులోకి వెళ్లేందుకు ముగ్గురు మహిళలు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఈ ముగ్గురిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. వీరంతా హిందూ మక్కల్ కట్చి సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు.

గతవారం మీడియా సమావేశం నిర్వహించిన ఈ ముగ్గురు మసీదులోకి వెళ్లితీరుతామని ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించినప్పుడు, మసీదులోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. కాగా, ఈ ముగ్గురు మహిళలపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News