KCR: ఇదేనా 'రిటర్న్ గిఫ్ట్'... కారెక్కనున్న నందమూరి సుహాసిని... ఎంఎల్సీని చేస్తామన్న టీఆర్ఎస్?

  • కూకట్ పల్లి నుంచి పోటీ చేసిన సుహాసిని
  • టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి
  • రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచన!

గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారా? చంద్రబాబుకు తానిస్తానన్న 'రిటర్న్ గిఫ్ట్' ఇదేనా? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం, అతి త్వరలోనే సుహాసిని కారెక్కబోతున్నారు.

ఇక, తానెంతో అభిమానించే ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన సుహాసినికి, రాజకీయ జీవితాన్ని అందించాలని భావిస్తున్న కేసీఆర్, ఆమెను పార్టీలోకి ఆహ్వానించి, ఎమ్మెల్సీని చేయాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఇదే హాట్ టాపిక్. సుహాసిని పార్టీ మారడంపై టీవీ-9 ఇచ్చిన ప్రత్యేక కథనాన్ని మీరు చూడవచ్చు.

More Telugu News