Pawan Kalyan: జిల్లాల్లో పోరాట యాత్రలకు స్వస్తి చెప్పనున్న పవన్

  • సమస్యలను తెలుసుకుంటూ పర్యటన
  • పార్టీ కార్యాలయంలో అందుబాటులో పవన్
  • నిర్ణయం తీసుకున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాన్ని మార్చబోతున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పోరాట యాత్రలు నిర్వహిస్తున్న ఆయన వాటికి స్వస్తి చెప్పనున్నారు. ఈ మేరకు పవన్ తాజాగా నిర్ణయం కూడా తీసేసుకున్నారు.

ఇకపై జిల్లాల్లో పర్యటిస్తారు కానీ సమస్యలను తెలుసుకుంటూ వాటిపై స్పందిస్తూ ఆయన పర్యటన సాగనుంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పార్టీ కార్యాలయంలో కూడా పవన్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలా జనసేన కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటూనే.. సంక్రాంతి నుంచి జిల్లాల్లో తిరగాలని పవన్ నిర్ణయించారు.

More Telugu News