Chandrababu: ‘పోలవరం’ రికార్డు సాధనకు చెమటోడ్చిన అందరికీ అభినందనలు: సీఎం చంద్రబాబు

  • కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు ఓ చారిత్రక ఘట్టం
  • ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ సమయమిది
  • ఇదే స్ఫూర్తితో పని చేసి ప్రాజెక్టును పూర్తి చేద్దాం

పోలవరం స్పిల్ వే కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు గిన్నిస్ రికార్డును నెలకొల్పడంపై సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడం ఓ చారిత్రక ఘట్టమని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ సమయమిదని, ఈ రికార్డు సాధించడంలో చెమటోడ్చిన వేలాది కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బందికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రాజెక్టును పూర్తి చేద్దామని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిస్తూ ఓ పోస్ట్ చేశారు. కాగా, కేవలం 24 గంటల వ్యవధిలోనే 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను, నిన్న ఉదయం నుంచి నవయుగ సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే.   

More Telugu News