america: అమెరికాలోని మిచిగాన్ లో తెలంగాణ వాసిపై కాల్పులు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన!

  • మహబూబాబాద్ కు చెందిన సాయికృష్ణపై కాల్పులు
  • ఓ రెస్టారెంట్ లో పార్శిల్ తీసుకుని వస్తుండగా ఘటన
  • డబ్బు, కారు.. అపహరించిన దుండగులు

అమెరికాలోని మిచిగాన్ లో తెలంగాణ వాసిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ కు చెందిన పూస సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు. ఓ రెస్టారెంట్ లో పార్శిల్ తీసుకుని బయటకు వస్తుండగా అతనిపై దుండగులు కాల్పులు జరిపారు. అతని వద్ద ఉన్న డబ్బు, గుర్తింపుకార్డులు సహా కారుని అపహరించుకుపోయారు. ఈ కాల్పుల్లో అతని కుడిచేతికి బుల్లెట్ గాయమైంది. కాగా, మిచిగాన్ లోని లోరెన్స్ టెక్ యూనివర్శిటీలో సాయికృష్ణ ఎంఎస్ చదువుతున్నాడు. 

More Telugu News