Abhishek: అప్పట్లో అభిషేక్ తో నా నిశ్చితార్థం అప్పటికప్పుడు జరిగిపోయింది!: ఐశ్వర్యరాయ్

  • పన్నెండేళ్ల క్రితం ఐశ్వర్య వివాహం 
  • ఉన్నట్టుండి అభిషేక్ నుంచి ఫోన్ 
  • ఇంటికి వస్తున్నామనగానే కంగారు 

ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ ఆ తరువాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. కెరియర్ ఉచ్ఛ స్థితిలో ఉండగానే 2006లో అమితాబచ్చన్ తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ ని వివాహాం చేసుకుంది. ఆ తరువాత కూడా ఆమె అప్పుడప్పుడు సినిమాలలో మెరుస్తూనే ఉంది. ఓ వైపు భార్యగా, మరో వైపు ఆరాధ్యకి తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే బాలీవుడ్ లో తనదైన పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే ఆమె వివాహమై 12 ఏళ్ళు పూర్తయ్యింది. అయినా ఇప్పటికీ ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో తన అభిమానులని అలరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాయ్ అభిషేక్ తో తన నిశ్చితార్ధం గురించి ఆసక్తికరమైన విషయాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

"అభిషేక్ నాకు ప్రప్రోజ్ చేసిన తర్వాత ఉన్నపళంగా ఒక రోజు ఫోన్ చేసి, మేము మీ ఇంటికి వస్తున్నాం, రోకా నిర్వహించడానికి అని చెప్పారు. అప్పటికి రోకా అంటే అది నిశ్చితార్థంలో ఓ భాగమని నాకు తెలియదు. అలాగే మా నాన్న కూడా ఇంట్లో లేరు. అదే విషయం అభిషేక్ కి చెప్పినా తను వినిపించుకోలేదు. ఇక అభిషేక్ తో పాటు తన కుటుంబం అంతా మా ఇంటికి వచ్చి రోకా చేసుకున్నారు. అలా అకస్మాత్తుగానే మా నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ తరువాత పెళ్లి అనే బంధంతో అభిషేక్, నేను ఒకటి కావడం జరిగింది. ఇన్నేళ్ల వివాహ బంధంతో నేను అభిషేక్ తో ఎంతో సంతోషంగా ఉన్నా" అని ఐశ్వర్య రాయ్ చెప్పింది.

More Telugu News