Rai Lakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాయ్ లక్ష్మి 'వెంకట లక్ష్మి' అప్ డేట్ 
  • రికార్డ్ సృష్టించిన తెలుగు పాట
  • తమిళంలో తెలుగు సినిమా రీమేక్    

*  రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారిగా నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి' చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే..' పాట ఎంతగా హిట్టయిందో మనకు తెలుసు. ఇప్పుడీ పాట యూట్యూబ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 173 మిలియన్ల వ్యూస్ తో ఈ పాట దక్షిణాదిన రికార్డుగా నిలిచింది.
*  తమిళం నుంచి తెలుగులోకి ఎక్కువగా సినిమాలు రీమేక్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ తెలుగు చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. ఆమధ్య శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన 'హుషారు' చిత్రాన్ని ఇప్పుడు వీవీ కదిర్ దర్శకత్వంలో తమిళంలో రీమేక్ చేస్తుండడం విశేషం.

More Telugu News