sbi: ఈ నెల 8,9 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

  • ఉద్యోగ విధానాలపై కేంద్రం తీరుపై నిరసన
  • సమ్మెకు పిలుపు నిచ్చిన పది ట్రేడ్ యూనియన్లు
  • భారత బ్యాంకుల సంఘానికి చేరిన సమాచారం

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు. ఈ నెల 8,9 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్ఐ) పిలుపు నిచ్చాయి. ఉద్యోగ విధానాలపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ 10 ట్రేడ్ యూనియన్లు ఈ మేరకు పిలుపు నిచ్చాయి. ఈ విషయాన్ని బ్యాంకు సంఘాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా తలపెట్టనున్న సమ్మె సమాచారాన్ని భారత బ్యాంకుల సంఘానికి (ఐబీఏ) అందించినట్టు సమాచారం. 

More Telugu News