t congress: పొత్తులతో నష్టపోయాం..నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • టీడీపీకి నామమాత్రపు కేడరే ఉంది
  • టీడీపీతో పొత్తుతో ఉద్యోగులు, యువత దూరమయ్యారు
  • టీఆర్ఎస్ చెప్పిన మాటలు ప్రజలు నమ్మారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో నష్టపోయామని, పొత్తులు వద్దని ముందే చెప్పామని టీ-కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. టీడీపీకి నామమాత్రపు కేడరే ఉందని, ఈ పార్టీతో పొత్తు వల్ల ఉద్యోగులు, యువత తమ పార్టీకి దూరమయ్యారని విమర్శించారు. ప్రజాకూటమి గెలిస్తే చంద్రబాబు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని, టీఆర్ఎస్ చెప్పిన మాటలను ప్రజలు నమ్మారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కనీసం 45 సీట్లు గెలుస్తుందని ఊహించాం కానీ, పొత్తుల వల్ల ఘోరంగా ఓడిపోయామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు వద్దని చెప్పానని, పొత్తులు లేకుంటే 7 పార్లమెంట్ సీట్లు తామే గెలుస్తామన్న విషయాన్ని పార్టీ అగ్రనేతలకు చెప్పానన్న కోమటిరెడ్డి,  నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

More Telugu News