rajani: 'పేట' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు

  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'పేట'
  • రేపు రాత్రి 7 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • జనవరి 10వ తేదీన భారీ విడుదల  

తమిళనాట అజిత్ సినిమా 'విశ్వాసం'తో పోటీపడటానికి రజనీ 'పేట' రంగంలోకి దిగిపోయింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు రానుంది. అదే రోజున ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. తెలుగులో గట్టిపోటీ ఉన్నప్పటికీ, 'పేట' వెనకడుగు వేయకుండా వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది.

రేపు (ఆదివారం) రాత్రి 7 గంటలకు హైదరాబాద్ - సైబర్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పలువురు సినీప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ .. విజయ్ సేతుపతి .. బాబీ సింహా పాత్రలు ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతున్నాయి. 

More Telugu News