India: మరో 3 నెలల్లో విమానాల్లో మొబైల్ సేవలు.. కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం!

  • నౌకలు, విమానాల్లో మొబైల్ సేవలకు ఏర్పాట్లు
  • ప్రక్రియను వేగవంతం చేయనున్న అధికారులు
  • ఎయిర్ లైన్స్, షిప్పింగ్ కంపెనీలతో భేటీ

విమానాల్లో మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కార్యాచరణ కోసం మంత్రిత్వ కమిటీని నియమించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే 3 నెలల్లో విమానాలు, నౌకల్లో ఐఎఫ్‌ఎమ్‌సీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలను ఈ కమిటీ సూచిస్తుంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 15 రోజులకు ఓసారి కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు.

ఈ సేవలను అందించే విషయమై విమానయాన సంస్థలు, షిప్పింగ్‌ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వ శాఖలతో భేటీ అయ్యాయని వెల్లడించారు. టెలికాం శాఖ అదనపు కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ అధ్యక్షతన రెండు గంటల పాటు సమావేశం సాగిందని పేర్కొన్నారు. భారత భూభాగంలో ఈ సేవలు అందించడానికి ప్రభుత్వం నిబంధనలను నోటిఫై చేసిందన్నారు.

More Telugu News